ఆలమూరు విద్యుత్ సబ్స్టేషన్లో ఏసీబీ దాడులు
ABN , First Publish Date - 2021-02-26T06:41:38+05:30 IST
అవినీతి నిరోధక శాఖ దాడులతో ఆలమూరు విద్యుత్ సబ్ స్టేషన్ దద్దరిల్లింది. ఏసీబీ రాజమహేంద్రవరం డీఎస్పీ పి.రామచంద్రరావు నేతృత్వంలో దాదాపు 30 మంది అధి కారులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి పలు రికార్డులను పరిశీలించారు.
- డీఎస్పీ ఆధ్వర్యంలో 30 మంది అధికారుల సోదాలు
ఆలమూరు, ఫిబ్రవరి 25: అవినీతి నిరోధక శాఖ దాడులతో ఆలమూరు విద్యుత్ సబ్ స్టేషన్ దద్దరిల్లింది. ఏసీబీ రాజమహేంద్రవరం డీఎస్పీ పి.రామచంద్రరావు నేతృత్వంలో దాదాపు 30 మంది అధి కారులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో ఇటీవల భారీ అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు భావిస్తున్నారు. ఇటీవలి పలు గ్రామాల్లో వేసిన కొత్త విద్యుత్ లైన్లతోపాటు కొత్త కనెక్షన్లపై విచారణ నిర్వహించారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు చేయనున్నట్టు సమాచారం. శుక్రవారం కూడా సోదాలు కొనసాగిస్తామని, తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.