ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-20T05:43:43+05:30 IST
జగన్నన కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు.
నరసాపురం రూరల్, మే 19: జగన్నన కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సబ్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. మండ లంలోని సీతారాంపురం నార్త్ గ్రామంలో జగన న్న కాలనీని గురువారం ఆయన పరిశీలించారు. లబ్థిదారుల జాబితా, ఎంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు, బిల్లుల పెండింగ్ ఉన్న నిర్మాణాలపై హౌసింగ్ అధికారులను ఆరా తీశారు. ఎంపీడీవో ప్రసాద్యాదవ్, తహసీల్దార్ బాజీ సత్యనారాయణ, హౌసింగ్ ఏఈ రవీంద్ర పాల్గొన్నారు.