విద్యార్థులకు వినూత్న కటింగ్ చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2022-06-22T14:50:35+05:30 IST
విద్యార్థులకు వినూత్న కటింగ్ చేసే సెలూన్ యజమానులపై చర్య లు చేపడతామని జిల్లా కలెక్టర్ కుమరవేల్ పాండ్యన్ హెచ్చరించారు. పట్టణంలోని పలు
- సెలూన్ నిర్వాహకులకు కలెక్టర్ హెచ్చరిక
వేలూరు(చెన్నై), జూన్ 21: విద్యార్థులకు వినూత్న కటింగ్ చేసే సెలూన్ యజమానులపై చర్య లు చేపడతామని జిల్లా కలెక్టర్ కుమరవేల్ పాండ్యన్ హెచ్చరించారు. పట్టణంలోని పలు పాఠశాలలను మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ పాఠశాల సమీపంలోని దుకాణంలో గుట్కా, పాస్ మసాలా విక్రయిస్తున్నారనే ఫిర్యాదుపై తగిన చర్యలు చేపట్టాలని పోలీసులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు యూనిఫారం ధరించి రావాలన్నారు. తల చక్కగా దువ్వుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనసభ్యసించాలకు కలెక్టర్ సూచించారు.