శారీరక దృఢత్వం కలిగి ఉండాలి: సీఐ
ABN , First Publish Date - 2021-01-14T04:23:15+05:30 IST
ప్రతి ఒక్కరు శారీరక దృఢత్వం కలిగి ఉండాలని, అప్పుడే ఆరోగ్యవంతులవుతారని వాకాడు సీఐ నరసింహారావు అన్నారు.
కోట, జనవరి 13 : ప్రతి ఒక్కరు శారీరక దృఢత్వం కలిగి ఉండాలని, అప్పుడే ఆరోగ్యవంతులవుతారని వాకాడు సీఐ నరసింహారావు అన్నారు. మండల పరిధిలోని గూడలి సమీపంలోని ప్లేగ్రౌండ్లో బుధవారం ‘లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాకాడు సీఐ విచ్చేసి విజేతలను అభినందించారు. అనంతరం జరిగిన అబుడోమిన్స్ ఈవెంట్లో ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామానికి చెందిన సెజ్ స్కూల్ విద్యార్థి గోళి హేమంత్ అనే విద్యార్థి గతంలో 96 నిమిషాలకు 2,226 గుంజీలు తీయగా.. ప్రస్తుతం 30 నిమిషాల్లో 2,342 గుంజీలు తీసి ప్రతిభను కనబరిచాడు. అదేవిధంగా వివిధ విభాగాల్లో వీబీఆర్ స్కూల్ విద్యార్థి మైపాటి యశ్వంత్, కాళంగి వెంకట్ సుమంత్లు ప్రతిభ కనబరిచారు. అనంతరం విజేతలను సీఐతో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఎల్లసిరి కృష్ణ, ఆములూరి నాగార్జున, మాధవ్, శరత్లు అభినందించి ప్రత్యేక జ్ఞాపికలను అందజేశారు.