విష్ణు కళాశాల విద్యార్థుల రక్తదానం
ABN , First Publish Date - 2022-07-01T05:51:47+05:30 IST
రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా వైద్యాధికారి టి.జయసింహ అన్నారు.
భీమవరం ఎడ్యుకేషన్, జూన్ 30: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా వైద్యాధికారి టి.జయసింహ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యు త్సవాలు పురస్కరించుకొని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బివి రాజు ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. వంద మంది విద్యార్ధులు, కళాశాల సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో భీమవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎం.వీరాస్వామి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం గరికిపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వీరత్వం, సమయస్ఫూర్తి విద్యార్థులు అలవరుచుకోవాలని గరికిపాటి సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.