విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-26T05:37:07+05:30 IST

యానాం నియోజకవర్గలోని కనకాలపేట జమ్మువాడవ గిరికాలనీకి చెందిన విద్యార్థిని గాడి స్రవంతి(15) ఆత్మహత్యకు పాల్పడింది.

విద్యార్థిని ఆత్మహత్య

యానాం, ఫిబ్రవరి 25: యానాం నియోజకవర్గలోని కనకాలపేట జమ్మువాడవ గిరికాలనీకి చెందిన విద్యార్థిని గాడి స్రవంతి(15) ఆత్మహత్య కు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. యానాంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న స్రవంతి గురువారం సాయత్రం స్కూలు నుం చి ఇంటికొచ్చి ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-26T05:37:07+05:30 IST