బద్వేలు చేరిన విద్యార్థి చైతన్య ర్యాలీ

ABN , First Publish Date - 2021-01-27T05:02:01+05:30 IST

విద్యార్థులకు శాపంగా మారిన జీఓనంబరు 77ను రద్దుచేయాలని కోరుతూ రైల్వేకోడూరు నుంచి చేపట్టిన ర్యాలీ రాజంపేట నుంచి బద్వేలు చేరుకుంది.

బద్వేలు చేరిన విద్యార్థి చైతన్య ర్యాలీ
మైదుకూరులో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

బద్వేలు, జనవరి 26: విద్యార్థులకు శాపంగా మారిన జీఓనంబరు 77ను రద్దుచేయాలని కోరుతూ రైల్వేకోడూరు నుంచి చేపట్టిన ర్యాలీ రాజంపేట నుంచి బద్వేలు చేరుకుంది. పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న, ఆర్‌ఎ్‌సవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి శంకర్‌, ఏఐపీఎ్‌సయూ రాష్ట్రకన్వీనర్‌ సుబ్బరాయుడు మాట్లాడుతూ

2020-21 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాల విద్యార్థులకు  జగనన్న వసతి, విద్యాదీవెన వర్తించబోవని ప్రభుత్వం జారీ చేసిన జీఓనంబరు 77ను రద్దుచేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా  ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. 

పోరుమామిళ్లలో...

పోరుమామిళ్ల, జనవరి 26: జీఓ నెం.77ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం రైల్వేకోడూరు నుంచి ప్రారంభమైన విద్యార్ధి చైతన్యయా త్ర రాజంపేట, బద్వేలు మీదుగా పోరుమామిళ్ల చేరుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంటును ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించకపోవడంతో అనేక ఆర్ధిక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. 

మైదుకూరులో....

మైదుకూరు, జనవరి 26: రైల్వేకోడూరులో ప్రారంభమైన విద్యార్థి ఛైత న్య యాత్ర మంగళవారం మైదుకూరు చేరుకుంది. అంబేడ్కర్‌ విగ్ర హం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నేతలు అంకన్న, శంకర్‌, సుబ్బరాయుడు, జయవర్దన్‌ తదితరులు మాట్లాడారు.

Updated Date - 2021-01-27T05:02:01+05:30 IST