ట్రాలర్ ఢీకొని విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2021-07-25T05:44:36+05:30 IST
షీలానగర్ టోల్ గేటు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు.
అక్కిరెడ్డిపాలెం, జూలై 24: షీలానగర్ టోల్ గేటు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పరవాడకు చెందిన కె.సుధాకర్రెడ్డి (22) తన పెదనాన్న వెంకటరెడ్డి ఇంటిలో వుంటూ గాయత్రి కళాశాలలో ఎంటెక్ చదువుతున్నాడు. సుధాకర్ శనివారం రాత్రి నగరంలో వున్న తన స్నేహితుడిని కలసి తిరిగి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా షీలానగర్ టోల్ గేటు దాటిన తరువాత గెయిల్ గేటు సమీపంలో ట్రాలర్ ఢీకొట్టింది. దీంతో కిందపడిన విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.