కాళ్లకల్లో విద్యార్థిని అదృశ్యం
ABN , First Publish Date - 2021-01-27T05:41:36+05:30 IST
తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో ఉన్న 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
తూప్రాన్ (మనోహరాబాద్), జనవరి 26: తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో ఉన్న 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైంది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో నివాసముండే భగవాన్ రామ్ చౌదరి, సుశీలదేవీకి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. భగవాన్రామ్ చౌదరి దంపతులు మంగళవారం జీడిమెట్ల, షాపూర్నగర్లోని బంధువుల వద్దకు వెళ్లారు. ఇంట్లో ఉన్న చిన్న కూతురు సౌమ్యాదేవి తల్లిదండ్రులకు అక్క కవిత(19) కనిపించడం లేదంటూ ఫోన్లో తెలిపింది. కూతురు కోసం పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు వివరించారు.