ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత
ABN , First Publish Date - 2021-12-07T05:58:15+05:30 IST
ప్రజలు రెండున్నరేళ్లుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
- టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయండి
- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు
- పార్టీలో చేరిన పలు సంఘాల నాయకులు
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 6: ప్రజలు రెండున్నరేళ్లుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్, మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిన్న వెంకటస్వామితో పాటు మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అఖిల్, రాయలసీమ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ప్రకాష్, ప్రశాంత్ రెడ్డి, మల్లికార్జున, శ్రీకాంత్, శ్రీనివాసులు, దళిత ఐక్యవేదిక వైస్ ప్రెసిడెంట్ శ్రీరాములు, జాతీయ యూత్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా సెక్రటరీ ఎల్లాగౌడు తదితరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తామన్నారు.