ఓటీఎస్ కోసం ఒత్తిడి దారుణం: టీడీపీ
ABN , First Publish Date - 2022-01-28T05:58:45+05:30 IST
ప్రజల మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ఓటీఎస్ కట్టించుకోవాలని చూస్తోందని గోనెగండ్ల మండల ప్రచార కార్యదర్శి పిల్లిగుండ్ల ఉల్లిగడ్డల రాముడు, మండల టీడీ పీ కార్యదర్శి ఎర్రబాడు శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు దరగల మాబు, ఒంటెడుదిన్నె రమేష్ఆచారి అన్నారు.
గోనెగండ్ల, జనవరి 27: ప్రజల మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ఓటీఎస్ కట్టించుకోవాలని చూస్తోందని గోనెగండ్ల మండల ప్రచార కార్యదర్శి పిల్లిగుండ్ల ఉల్లిగడ్డల రాముడు, మండల టీడీ పీ కార్యదర్శి ఎర్రబాడు శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు దరగల మాబు, ఒంటెడుదిన్నె రమేష్ఆచారి అన్నారు. బుధవారం వారు మట్లాడుతూ ఓటీఎస్ డబ్బుల కోసం పొదుపు గ్రూపులో ఉన్న మహిళల మీద గ్రామ ఐక్యపొదుపు గ్రూపు సభ్యులు, వెలుగు సీసీ, బుక్ కీపర్లతో ఒత్తిడి తీసుకురావటం దారుణం అన్నారు. పంటలు పండక రైతులు ఇబ్బందుల్లో ఉంటే వారిని ఓటీఎస్ కట్టమని తీవ్రమైన ఒత్తిడి చేయడం అన్యాయమని అన్నారు. ఇది వైసీపీ దివాళాకోరుతనానికి నిదర్శనం కాదా అని వారు ప్రశ్నించారు.