చెన్నూర్లో వింత శిశువు జననం... గంటలోపే మృతి
ABN , First Publish Date - 2020-08-09T07:18:16+05:30 IST
చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం వింత శిశువు జన్మించింది. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి...
చెన్నూర్, ఆగస్టు 8: చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం వింత శిశువు జన్మించింది. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ప్రియాంకకు పురిటి నొప్పులు రావడంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా వాహనంలోనే పురుడు పోసుకొంది. పుట్టిన శిశువుకు ఒకే కన్ను ఉండి, ముక్కు లేకుండా ఉంది. దీంతో సిబ్బంది ప్రియాంకను, శిశువుకు ఆస్పత్రిలోకి తరలించి చికిత్స అందించారు. పుట్టిన గంట లోపే మృతి చెందింది. జన్యుపరమైన లోపంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వైద్యురాలు ఆరుణశ్రీ పేర్కొన్నారు.