మట్టి.. కొల్లగొట్టి..

ABN , First Publish Date - 2022-01-17T06:52:01+05:30 IST

మట్టి మాఫియా రెచ్చిపోతోంది.

మట్టి.. కొల్లగొట్టి..
కాలువ గట్టును తవ్వేసిన దృశ్యం

రెచ్చిపోతున్న మట్టి మాఫియా...

పట్టించుకోని అధికారులు

తాడిపూడి కాలువ గట్టుకు గండ్లు 

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 16: మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తాడేపల్లిగూడెం జగ్గన్నపేట, కొమ్ముగూడెం, నీలాద్రిపురం, పట్టింపాలెం ప్రాంతాల్లో తాడిపూడి కాలువగట్లను కొల్లగొడుతున్నారు. మరో పక్క గట్లు కొట్టుకుపోతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన కనిపించడంలేదు. రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమార్కులు కాలువగట్లపై పడి నమిలేస్తున్నారు. కాలువ తవ్విన సమయంలో కొండలను తలపించేలా ఉన్న గట్లు ప్రస్తుతం కంటికి కనిపించడంలేదు. దీనికి తోడు కాలువ గట్టు తొలిచేస్తూ కాలువ పరివాహక రైతులు గట్టు క్షినించేలా ఆక్రమించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ గ్రామాల్లో పంట చేలలో మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా బయట ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. ఈ విషయంలో ఈ ప్రాంత వాసులు ఎన్ని సార్లు లారీలను నిలుపుదల చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 

Updated Date - 2022-01-17T06:52:01+05:30 IST