విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం: బొలిశెట్టి

ABN , First Publish Date - 2021-10-29T04:55:37+05:30 IST

విశాఖ ఉక్కును పరిరక్షించుకు ందామని జనసేన తాడేపల్లిగూడెం నియోజ కవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం: బొలిశెట్టి
నినాదాలు చేస్తున్న జనసేన నాయకులు

 తాడేపల్లిగూడెం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కును పరిరక్షించుకు ందామని జనసేన తాడేపల్లిగూడెం నియోజ కవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. విశాఖ  ఉక్కు పరిరక్షణకోసం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈనెల 31న గాజువాకలో నిర్వహించే బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నుంచి అధిక సంఖ్యలో జనసైనికులు తరలివెళ్లనున్నట్టు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకోసం జనసేన నాయకులు గురువారం నిరసన తెలిపారు.  రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బొలిశెట్టి మండిపడ్డారు. ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు పరిరక్షణను రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అభివృద్ధిని, యువతకు ఉపాధి మార్గాలను పక్కనపెట్టి అప్పులతో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తూర్పారబట్టారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణ మూర్తి, యంట్రపాటి రాజు, చాపల రమేష్‌, మైలవరపు రాజేంద్ర ప్రసాద్‌, మాదాసు ఇందు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T04:55:37+05:30 IST