ఆన్లైన్ ఇంకెప్పుడు?
ABN , First Publish Date - 2020-07-04T11:10:27+05:30 IST
సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు ఆన్లైన్ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారు.ఈ బ్యాంకు వ్యవహారాలను ఆన్లైన్
సప్తగిరి బ్యాంకు ఖాతాదారుల అవస్థలు
అమరావతి,జూన్ 30(ఆంధ్రజ్యోతి):సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు ఆన్లైన్ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారు.ఈ బ్యాంకు వ్యవహారాలను ఆన్లైన్ చేయకపోవడంతో కొన్ని వ్యాపార అవకాశాలను కోల్పోతోంది. 2007లో ఈ బ్యాంకుకు కేవలం 27 శాఖలుండగా, ఇప్పుడవి సుమారు 224కు పెరిగాయి. రాష్ట్రంలోని కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఈ బ్యాంకు శాఖలున్నాయి. బ్యాంకు వ్యాపారంతోపాటు ఖాతాదారులు పెరుగుతున్నారు. డిజిటల్ యుగానికి తగ్గట్లుగా ఆన్లైన్ చేస్తే మరింత వృద్ధి చెందేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోను ఈ బ్యాంకు శాఖలున్నాయి. చిత్తూరు జిల్లాలో 134 శాఖలు, కృష్ణా జిల్లాలో 86 శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ఐదు గ్రామీణ బ్యాంకులుండగా, అందులో నాలుగు బ్యాంకుల్ని ఆన్లైన్ చేశారు. ఇదొక్కటే ఇంకా ఆన్లైన్ కాలేదు. మొత్తం బ్యాంకు వ్యవహారాలను ఇతర బ్యాంకుల్లాగే ఆన్లైన్ చేస్తే అటు ఖాతాదారులకు, ఇటు బ్యాంకుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.