అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి : గుత్తా
ABN , First Publish Date - 2021-01-25T05:44:16+05:30 IST
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పయనిస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
అడవిదేవులపల్లి(దామరచర్ల), జనవరి 24 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పయనిస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి అడవిదేవులపల్లి మండలకేంద్రంలో రూ.22లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక, ఎమ్మా ర్సీ రిసోర్స్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయుత అందిస్తూ ప్రజా సం క్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అనంతరం రూ.22లక్షలతో సీడీపీ నిధుల నుంచి మంజూరైన ఎస్టీ కమ్యునిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఆర్డీవో రోహిత్సింగ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచ ందర్నాయక్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ధీరావత్ స్కైలాబ్నాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యానాయక్, సర్పంచ్ కొత్తా మర్రెడ్డి, వైస్ఎంపీపీ కూరాకుల మల్లీశ్వరి పాల్గొన్నారు.