జగన పాలనలో రాష్ట్రం అధోగతి: టీడీపీ

ABN , First Publish Date - 2022-05-17T06:14:23+05:30 IST

సీఎం జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ నాయకులు విమర్శించారు. సోమవారం సా యంత్రం స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌లో పార్టీ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జగన పాలనలో రాష్ట్రం అధోగతి: టీడీపీ
కొవ్వొత్తుల ర్యాలీలో టీడీపీ నాయకులు

సోమందేపల్లి, మే 16: సీఎం జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ నాయకులు విమర్శించారు. సోమవారం సా యంత్రం స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌లో పార్టీ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవ్వొత్తులతో నిరసన ప్ర దర్శన చేపట్టారు. హిందూపురం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, నాయకులు శశిభూషణ్‌, సిద్దలింగప్ప, న రసింహులు, రామక్రిష్ణ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భ ద్రతలు క్షీణించిపోయాయని, మహిళలకు రక్షణ కరువైందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు.  


19న మడకశిరలో ‘బాదుడే బాదుడు’

మడకశిర టౌన: పట్టణంలో ఈనెల 19న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనోహ ర్‌ తెలిపారు.  సాయంత్రం 6 గంటలకు జరిగే కార్యక్రమానికి టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి హాజరవుతున్న ట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరిగిన విద్యుత చార్జీలు, వంగ గ్యాస్‌, పెట్రోల్‌, డీజీల్‌, నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ చేపట్టే నిరసనకు పార్టీ నాయకులు, కా ర్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.  


Updated Date - 2022-05-17T06:14:23+05:30 IST