Icuలో రాష్ట్ర కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-07-08T14:36:34+05:30 IST

రాష్ట్ర కాంగ్రెస్‌ ఐసీయూలో ఉంటూ డీఎంకే నుంచి ఆక్సిజన్‌ను తీసుకుంటూ శ్వాస తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎద్దేవా చేశారు.

Icuలో రాష్ట్ర కాంగ్రెస్‌

                                - బీజేపీ అధ్యక్షుడు అన్నామలై


పెరంబూర్‌(చెన్నై), జూలై 5: రాష్ట్ర కాంగ్రెస్‌ ఐసీయూలో ఉంటూ డీఎంకే నుంచి ఆక్సిజన్‌ను తీసుకుంటూ శ్వాస తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎద్దేవా చేశారు. రెట్టమలై శ్రీనివాసన్‌ జయంతి సందర్భంగా స్థానిక గిండిలోని ఆయన విగ్రహానికి గురువారం పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అన్నామలై మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో రాష్ట్రంలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ అంగీకరించదని, మహారాష్ట్రలో జరిగినట్లు తమిళనాడులోనూ అధికారమార్పిడి జరుగుతుందని తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 24 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామని అన్నామలై జోస్యం చెప్పారు.

Updated Date - 2022-07-08T14:36:34+05:30 IST