ఏలూరులో శ్రీవారి లడ్డూల విక్రయాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-26T10:38:50+05:30 IST

ఏలూరు టీటీడీ కల్యాణ మండపం వద్ద సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వారి లడ్డూ విక్రయాలు ..

ఏలూరులో శ్రీవారి లడ్డూల విక్రయాలు ప్రారంభం

ఏలూరు కార్పొరేషన్‌, మే 25 : ఏలూరు టీటీడీ కల్యాణ మండపం వద్ద సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వారి లడ్డూ విక్రయాలు ప్రారంభించారు. ‘జిల్లాకు 15 వేల లడ్డూలు వచ్చాయి. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం మూడు నుంచి ఆరు గంటల వరకు ఒక్కోటి రూ.25 చొప్పున విక్రయిస్తున్నాం. తొలిరోజు 13 వేల లడ్డూలు అమ్మకాలు జరిపాం. కరోనా నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శనం చేయలేకపోయినా, స్వామి వారి ప్రసాదాన్ని అందజేయాలనే లక్ష్యంతో వీటిని సరఫరా చేస్తున్నాం. ఇవి పూర్తయిన వెంటనే మళ్లీ రప్పిస్తాం’ అని టీటీడీ విజయవాడ ఇంజనీరింగ్‌ అధికారి ఎం.నాగభూషణం తెలిపారు. కల్యాణ మండపం మేనేజర్‌ ఆర్‌.భాస్కరరెడ్డి, జిల్లా అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎంవి రామచంద్రరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-26T10:38:50+05:30 IST