శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

ABN , First Publish Date - 2021-09-17T06:40:12+05:30 IST

పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువా రం ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు.

శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

కదిరి, సెప్టెంబరు 16 : పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువా రం ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. నగదు రూ. 4920070, బంగారం 23 గ్రాములు, వెండి 652 గ్రాములు వచ్చిందని ఆలయ చైర్మన్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి, ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.  ఈ ఆదాయం 43 రోజులకు గాను వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్ర మానికి పాలకమండలి సభ్యులు ఆర్‌ శ్రీనివాసులు, అనురాధ, సంజయ్‌ బాబు, హుండీ పర్యవేక్షణ అధికారి నరసింహరాజు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది,  ఏపీజీపీ మేనేజర్‌ విశ్వనాథ్‌, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-17T06:40:12+05:30 IST