శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు
ABN , First Publish Date - 2020-10-20T14:42:58+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా నాలుగవరోజు కూస్మాండదుర్గ అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం కైలాసవాహనంపై ఆలయ ప్రాంగణంలో స్వామిఅమ్మవార్లు విహారించనున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు.