Srisailam జలాశయానికి కొనగుతున్న వరద నీరు
ABN , First Publish Date - 2021-11-24T13:07:23+05:30 IST
జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 40,480 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో నిల్గా ఉంది.
కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 40,480 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో నిల్గా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా... ప్రస్తుతం 865.60 అడుగుల మేర నీటిమట్టం చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 124.8304 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.