నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-02-22T13:25:48+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఈరోజు నుంచి మార్చి 4 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. మొదటిసారి స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పించనుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి నుండి భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం కల్పించనున్నారు. మార్చి 5 నుండి స్పర్శ దర్శనాలు పున:ప్రారంభంకానుంది. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరుగనుంది. 

Updated Date - 2022-02-22T13:25:48+05:30 IST