‘చంద్రబాబును టచ్‌ చేసే దమ్ముందా?’

ABN , First Publish Date - 2021-02-27T18:59:11+05:30 IST

చంద్రబాబు నాయుడిని టచ్‌చేసే దమ్ము, ధైర్యం ఉందా

‘చంద్రబాబును టచ్‌ చేసే దమ్ముందా?’

  • సజ్జల వీధి కుక్కలా మొరుగుతున్నాడు
  • టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి

నెల్లూరు : చంద్రబాబు నాయుడిని టచ్‌చేసే దమ్ము, ధైర్యం ఉందా అంటూ తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి వైసీపీ నేతలను ప్రశ్నించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. చంద్రబాబుపై దాడి జరిగితే తామేమీ చేయలేమని ప్రభుత్వ సల హాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా జగన్‌ పాదయాత్రను అడ్డుకోమని తమ అధినేత పిలుపు ఇచ్చి ఉంటే జగన్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యగలిగే వాడా అని ప్రశ్నించారు. వీధికుక్కలా మొరుగుతున్న సజ్జల మాటలు చంద్రబాబుపై దాడి చేయమని వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పేలా ఉన్నాయన్నారు.


సజ్జల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని డీజీపీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ పథకాలు కట్‌చేస్తామని చెబుతున్నారని,  ఎవరిసొమ్ముతో పథకాలు నడుపుతున్నారో చెప్పాలన్నారు. వైసీపీకి దమ్ముంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్రత్యేకహోదా వచ్చేలా చూడాలని సవాల్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మామిడాల మధు, కప్పిర శ్రీనివాసులు, పిట్టి సత్యనాగేశ్వరరావు, ఉచ్చి భువనేశ్వ రీప్రసాద్‌, మస్తాన్‌, జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T18:59:11+05:30 IST