ఆడికృత్తిక ఉత్సవాలకు ధ్వజారోహణం

ABN , First Publish Date - 2020-08-09T11:45:13+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయ ఆడికృత్తిక మహోత్సవాలకు శనివారం ..

ఆడికృత్తిక ఉత్సవాలకు ధ్వజారోహణం

శ్రీకాళహస్తి, ఆగస్టు 8: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయ ఆడికృత్తిక మహోత్సవాలకు శనివారం శాస్ర్తోక్తంగా ధ్వజారోహణం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని చెంగల్రాయస్వామివారి సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు ప్రత్యేక అలంకరణలు చేసి వెండి చప్పరంపై అధిష్టింపజేసి చెంగల్రాయస్వామి సన్నిధికి ఎదురుగా కొలువుదీర్చారు. గణపతి పూజ పుణ్యావాచనం చేసి కలశ స్థాపన చేశారు. కలశపూజ నిర్వహించి సకల దేవగణాలను ఆవాహనం చేసి హోమ పూజలను జరిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ ఏకాంతంగా నిర్వహించారు.


Updated Date - 2020-08-09T11:45:13+05:30 IST