ముక్కంటి ఆలయానికి వెండి బిందె వితరణ
ABN , First Publish Date - 2022-05-25T05:37:57+05:30 IST
జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనకాపల్లెకు చెందిన ఎస్.ఆదినారాయణ మంగళవారం చిన్నవెండి బిందెను వితరణ చేశారు.
శ్రీకాళహస్తి, మే 24: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనకాపల్లెకు చెందిన ఎస్.ఆదినారాయణ మంగళవారం చిన్నవెండి బిందెను వితరణ చేశారు. ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు బిందెను స్వీకరిం చారు. బిందెను అమ్మవారి అభిషేకానికి ఉపయోగించాలని దాత కోరారు. ఆయనకు స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.