ఈ సంక్రాంతి చీకటి సంక్రాంతి: TDP leader

ABN , First Publish Date - 2022-01-11T19:09:38+05:30 IST

రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు.

ఈ సంక్రాంతి చీకటి సంక్రాంతి: TDP leader

శ్రీకాకుళం: రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా ఎచ్చెర్లలో టీడీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సంక్రాంతి పండగను ప్రజలు ఆనందంగా జరువుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యిందని ప్రశ్నించారు. రైతులు రక్త కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయన్నారు. జగన్‌ను గద్దె దింపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రన్న సంక్రాంతి కానుక పేదలకు ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు. ఈ సంక్రాంతి చీకటి సంక్రాంతి అని... నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారని రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. 

Updated Date - 2022-01-11T19:09:38+05:30 IST