శ్రీకాకుళం: నగరంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ప్రముఖులంతా హాజరయ్యారు. అచ్చెన్నాయుడు వేదికపైకి వచ్చారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో పక్కనే కూర్చోబోయారు. ఇంతలో సోఫా విరిగిపోవడంతో రామ్మోహన్, అచ్చెన్నాయుడు వేదికపై పడిపోయారు. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు వారిని పైకిలేపి మరో కుర్చీని ఏర్పాటు చేశారు.