Srikakulam: పలాస ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-03-08T14:52:52+05:30 IST

జిల్లాలోని పలాస ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు.

Srikakulam: పలాస ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

శ్రీకాకుళం: జిల్లాలోని పలాస ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు.  పోలీసుల వేధింపులకు మందస మండలం పొత్తంగి గ్రామంలో టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులు వేధింపులకు గురిచేశారని.... ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని భయపెట్టారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వేధింపులు తట్టుకోలేక పురుగులు ముందు తాగి టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు బలవన్మరణానికి చేసుకున్న కోన వెంకటరావు కుటుంబ సభ్యులతో డీఎస్పీ శివరామిరెడ్డి మాట్లాడారు. అయితే వేధింపులకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు డెడ్ బాడీ తీసుకువెళ్ళేది లేదని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. 

Updated Date - 2022-03-08T14:52:52+05:30 IST