శ్రీ శ్రీ రవిశంకర్కు అందని ఆహ్వానం..
ABN , First Publish Date - 2020-08-05T01:16:04+05:30 IST
అయోధ్యలో ఈనెల 5న జరుగనున్న రామాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి శ్రీ శ్రీ రవింశర్ను ఆహ్వానించినట్టు వస్తున్న..
న్యూఢిల్లీ: అయోధ్యలో ఈనెల 5న జరుగనున్న రామాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి శ్రీ శ్రీ రవింశర్ను ఆహ్వానించినట్టు వస్తున్న వార్తలను ఆర్డ్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఆయనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపింది.
'శ్రీ శ్రీ రవిశంకర్ను ఆహ్వానించినట్టు మీడియా ద్వారానే తెలిసింది. అయితే, భూమిపూజ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎలాంటి ఆహ్వానం అందలేదు' అని ఫౌండేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, యోగా గురువు రాందేవ్ బాబా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తమకు అందిన ఆహ్వానం మేరకు మంగళవారంనాడు అయోధ్య బయలుదేరి వెళ్లారు.