జడ్పీ సీఈవోగా శ్రీరామమూర్తి

ABN , First Publish Date - 2022-09-29T05:46:54+05:30 IST

జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లా సహకార అధికారి పి.శ్రీరామమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.

జడ్పీ సీఈవోగా శ్రీరామమూర్తి

విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లా సహకార అధికారి పి.శ్రీరామమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. జడ్పీ సీఈవోగా ఇప్పటివరకు డిప్యూటీ సీఈవో సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీఈవోగా పోస్టింగ్‌ పొందిన శ్రీరామమూర్తి ఈ నెల 30వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2000 సంవత్సరంలో గ్రూప్‌-2 ఏ ద్వారా ఏసీటీవోగా ఎంపికైన శ్రీరామమూర్తి...2007లో గ్రూపు-1 రాసి సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌ పొందారు. ఆ తరువాత మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా, జీసీసీ ఆడిటర్‌గా పనిచేశారు. ఇటీవల జిల్లాల విభజనతో అల్లూరి జిల్లా డీసీవోగా బదిలీపై వెళ్లారు. 


Updated Date - 2022-09-29T05:46:54+05:30 IST