ఇల్లందుకుంటలో శ్రీరామ పట్టాభిషేకం

ABN , First Publish Date - 2020-04-04T10:45:52+05:30 IST

ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం స్వామి వారి పట్టాభిషేకం

ఇల్లందుకుంటలో శ్రీరామ పట్టాభిషేకం

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 3: ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం స్వామి వారి పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివారి ఉత్సవమూర్తులను పూలతో అలంకరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అద్దాల మేడలో పట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లెకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్‌ ఎక్కటి మధుసూదన్‌రెడ్డి, గ్రామసర్పంచ్‌ శ్రీలత-సురేందర్‌రెడ్డి, ధర్మకర్తలు చర్లపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:45:52+05:30 IST