క్రీడా ప్రాంగణాల పనులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-07-03T05:51:50+05:30 IST
ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న క్రీడా ప్రాంగణాలను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం మండల పరిధిలోని విభలాపురంలో మెగా పల్లెప్రకృతి వనం, గ్రామీణ క్రీడా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు.
మోతె, జూలై 2: ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న క్రీడా ప్రాంగణాలను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం మండల పరిధిలోని విభలాపురంలో మెగా పల్లెప్రకృతి వనం, గ్రామీణ క్రీడా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. మెగా పల్లెప్రకృతిలో పూర్తిస్థాయిలో పనులు జరగకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తుమ్మలపల్లిలో శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీగ్రామంలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చే యాలన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకంలో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కా ర్యక్రమంలో ఎంపీడీవో కే.శంకర్రెడ్డి, తహసీల్దార్ యాదగిరి,ఎంపీవో హరిసింగ్, ఏపీవో, సర్పంచ్ వాసంశెట్టి రమే ష్, ఈసీ ఎడ్ల శ్రీను, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.