సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-07-02T06:23:57+05:30 IST

వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ ఆదేశించారు. ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేయండి
ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్‌, ఇతర అధికారులు

ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌

విశాఖపట్నం, జులై 1 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ ఆదేశించారు.  ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు,  గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమావేశం అనంతరం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ సంతోష్‌కుమార్‌, డైరెక్టర్లు బి.చంద్రం, రమేశ్‌ప్రసాద్‌, సీజీఎం సూర్యప్రతాప్‌, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:23:57+05:30 IST