అద్భుత సినీ శకం ముగిసింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-25T19:53:09+05:30 IST

గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అద్భుత సినీ శకం ముగిసింది: చంద్రబాబు

అమరావతి: గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదని ట్విట్టర్ వేదికగా వాపోయారు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉందన్నారు. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసిందని, ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.   



Updated Date - 2020-09-25T19:53:09+05:30 IST