రేపటి నుంచి స్పందన
ABN , First Publish Date - 2021-07-25T06:30:29+05:30 IST
కొవిడ్ కారణంగా కలెక్టరేట్లో నిలిచిపోయిన ‘స్పందన’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది.
చిత్తూరు (సెంట్రల్), జూలై 24: కొవిడ్ కారణంగా కలెక్టరేట్లో నిలిచిపోయిన ‘స్పందన’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను శనివారం జేసీ వీరబ్రహ్మంతో కలిసి కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించి, డీఆర్వో మురళికి పలు సూచనలు చేశారు. గతేడాది మార్చి 16న చివరి స్పందన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కొవిడ్ నేపథ్యంలో రద్దయింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ఉదయం 10 గంటల నుంచి స్పందన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.