టీఎన్జీవో కాలనీలో మళ్లీ శబ్దాలు
ABN , First Publish Date - 2020-10-30T09:56:08+05:30 IST
గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అత్యధిక స్థాయిలో బ్లాస్టింగ్ శబ్దాలు వస్తున్నాయని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం జంగయ్య, సభ్యులు గురువారం గచ్చిబౌలి..
రాయదుర్గం,అక్టోబర్29(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అత్యధిక స్థాయిలో బ్లాస్టింగ్ శబ్దాలు వస్తున్నాయని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం జంగయ్య, సభ్యులు గురువారం గచ్చిబౌలి పోలీసులకు, ఆర్డీవో చంద్రకళకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి అని తెలిపారు. గురువారం ఉదయం 11.45 గంటలకు గతంలో మాదిరిగానే భూమిలోనుంచి పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులంతా తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారన్నారు. నిర్మాణ సంస్థలు చేస్తున్న బ్లాస్టింగ్ల వల్లనే శబ్దాలు వస్తున్నాయని, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.