పసివాడికి ప్రాణం పోసిన సోనూసూద్
ABN , First Publish Date - 2021-10-19T05:13:41+05:30 IST
సామాజిక సేవతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ పసివాడికి ప్రాణం పోశాడు. గుండె సంబంద సమస్యతో బాధపడుతున్న నాలు
గుండె ఆపరేషన్కు ఆర్థిక చేయూత
ముంబైలో విజయవంతంగా పూర్తయిన ఆపరేషన్
కల్లూరు, అక్టోబరు 18: సామాజిక సేవతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ పసివాడికి ప్రాణం పోశాడు. గుండె సంబంద సమస్యతో బాధపడుతున్న నాలుగు నెలల వయస్సున చిన్నారికి ఆపరేషన్ చేయించి తన దాతృత్వాన్ని మరోసారి చాటాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతుల కుమారుడికి పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్య ఏర్పడింది. దీంతో ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు ఆపరేషన చేయించాలని తెలిపారు. వైద్యసహాయం కోసం తండ్రి కృష్ణ బంధుమిత్రుల ద్వారా తిరువూరు జనవిజ్ఞాన వేదిక బాధ్యులకు సమాచారం అందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను కృష్ణాజిల్లా తిరువూరు జనవిజ్ఞాన కార్యదర్శి రామ్ప్రతీప్ ద్వారా సోనూసోద్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో స్పందించిన సోనూసూద్ ముంబైలోని వాడియా ఆసుపత్రిలో చిన్నారి ఆపరేషనకు సహకారం అందించారు. అక్కడి వైద్యులు శనవారం నాలుగు గంటలపాటు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఆపరేషనను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని జనవిజ్ఞాన జిల్లా కార్యదర్శి విలేకరులకు తెలిపారు. బాలుడికి ఆపరేషన చేయించినందుకు సోనూసూద్కు, వైద్యులకు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు హైదరాబాద్లో ఆ బాలుడిని వైద్యచికిత్స కోసం తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండెసంబంధిత శస్త్రచికిత్స కోసం రూ.6లక్షలు ఖర్చవుతుందని చెప్పటంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో జనవిజ్ఞాన వేదిక ద్వారా ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ స్పందించి తమ బాలుడిని కాపాడేందుకు ముందుకొచ్చి ఆపరేషన చేయించినందుకుగానూ చిన్నారి కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది.