సోనియాతో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ
ABN , First Publish Date - 2021-11-26T00:52:23+05:30 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని 10 జన్పథ్లోని ఆమె నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఏకే ఆంటొనీ, ఆనంద్ శర్మ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌధురి, కేసీ వేణుగోపాల్, కే సురేశ్, రవ్నీత్ బిట్టూ, జై రామ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.