ఉపాధ్యాయుల ఔదార్యం

ABN , First Publish Date - 2020-08-11T09:56:47+05:30 IST

మునిసిపాలిటీ పరిధిలో కొత్తపాలెం వార్డుకు చెందిన ఆడారి బాను (14) అనే బాలికకు వైద్య పరీక్షలు నిమిత్తం ఉపాధ్యాయుడు ..

ఉపాధ్యాయుల ఔదార్యం

బాలికకు వైద్యపరీక్షలకు ఆర్థిక సాయం


ఎలమంచిలి, ఆగస్టు 10 : మునిసిపాలిటీ పరిధిలో కొత్తపాలెం వార్డుకు చెందిన ఆడారి బాను (14) అనే బాలికకు వైద్య పరీక్షలు నిమిత్తం ఉపాధ్యాయుడు వి.జానకిరామరాజుతోపాటు సోమలింగపాలెం జడ్పీ హైస్కూలు ఉపాధ్యాయులు విరాళాలు వేసుకుని రూ.31,500 సాయాన్ని అందజేశారు. గతంలో ఇదే పాఠశాల చదువుకున్న బానుకు బ్రెయిన్‌ ఆపరేషన్‌ అవసరమని వైద్యులు నిర్ధారించారు. బాలిక కుటుంబం నిరుపేద కావడంతో చదువు చెప్పిన ఉపాధ్యాయుడు జానకిరామరాజు స్పందించి, మిగిలిన ఉపాధ్యాయులతో సంప్రదించారు. ఇందుకు ఉపాధ్యాయులం దరూ ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాఽద్యాయులు డి.నారాయణరావు, శ్యామ్‌ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T09:56:47+05:30 IST