ఉద్యమాలతోనే విద్యార్థుల సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-13T04:54:08+05:30 IST

రాజంపేట పట్టణంలో 87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి నినా దాలు చేశారు.

ఉద్యమాలతోనే విద్యార్థుల సమస్యల పరిష్కారం
రైల్వే కోడూరు: జెండా ఆవిష్కరిస్తున్న కామ్రేడ్‌ రాధాకృష్ణ

రాజంపేట, ఆగస్టు12 : రాజంపేట పట్టణంలో 87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి నినా దాలు చేశారు. ఏఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివరామ కృష్ణ దేవర, దినేష్‌, మహమ్మద్‌, సాయిరాం తదిత రులు మాట్లాడుతూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించినప్పటి నుంచి రాజీలేని పోరాటాలతో పలు సమస్యలు పరిష్కరించిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర భుత్వం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు తొత్తు గా మారి పేద వర్గాలను విద్యకు దూరం చేస్తోంద న్నారు. నూతన విధ్యావిధానం పేరుతో గ్రామాల్లో పాఠశాలలను మూసివేయడం, అమ్మఒడి, విద్యా దీవెన పేర్లతో విద్యార్థులను మోసగిస్తోందన్నారు.   చంద్రశేఖర్‌, చిన్నకృష్ణ, సునీల్‌, బాలచంద్ర, శివయ్య, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: ఉద్యమాలతోనే విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని ఏఐఎస్‌ఎఫ్‌ నియోజక వర్గ ఉపాధ్యక్షుడు పండుగోల వేదాంత తెలిపారు. సోమవారం  పట్టణంలోని షిరిడిసాయి జూనియర్‌ కళాశాలలో ఏఐఎస్‌ఎఫ్‌ పూర్వ నాయకుడు కామ్రేడ్‌ రాఽధాకృష్ణ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేదాంత మాట్లాడుతూ ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం మహోజ్వల పోరాటచరిత్ర కలిగినదని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని  పోరాటాలు చేస్తున్నామన్నారు. సీపీఐ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, సహాయ కార్యదర్శి పండుగోల మణి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T04:54:08+05:30 IST