వృద్ధుల సమస్యలు సత్వరం పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-09-19T09:46:21+05:30 IST
వృద్ధుల సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు
కలెక్టర్ అనితా రామచంద్రన్
యాదాద్రి, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి): వృద్ధుల సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు. వృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కో సం జిల్లా స్థాయి వృద్ధుల డివిజన్ స్థాయి కమిటీలను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, కమిటీ సభ్యులతో ఆన్లైన్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వృద్ధుల సమస్యలు, వాటి పరిష్కారానికి అధికారుల కార్యాచరణను కలెక్టర్ వివరించారు.జిల్లా సంక్షేమ అధికారి స్వరాజ్యం మాట్లాడుతూ జిల్లాలో వృద్ధులు, అనాథల కోసం ఎనిమిది ఆశ్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివా్సరెడ్డి, డీఎంహెచ్ఓతో పాటు డీసీపీ కె.నారాయణరెడ్డి పాల్గొన్నారు.