వృద్ధుల సమస్యలు సత్వరం పరిష్కరించండి

ABN , First Publish Date - 2020-09-19T09:46:21+05:30 IST

వృద్ధుల సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించారు

వృద్ధుల సమస్యలు సత్వరం పరిష్కరించండి

కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ 


 యాదాద్రి, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి): వృద్ధుల సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించారు. వృద్ధుల  హక్కుల పరిరక్షణ, సంక్షేమం కో సం జిల్లా స్థాయి  వృద్ధుల  డివిజన్‌ స్థాయి కమిటీలను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, కమిటీ సభ్యులతో ఆన్‌లైన్‌ జూమ్‌  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వృద్ధుల సమస్యలు, వాటి పరిష్కారానికి అధికారుల కార్యాచరణను కలెక్టర్‌ వివరించారు.జిల్లా సంక్షేమ అధికారి స్వరాజ్యం మాట్లాడుతూ జిల్లాలో వృద్ధులు, అనాథల కోసం ఎనిమిది ఆశ్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, డీఎంహెచ్‌ఓతో పాటు డీసీపీ కె.నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T09:46:21+05:30 IST