సామాజిక దూరం పాటిద్దాం

ABN , First Publish Date - 2020-03-28T06:55:35+05:30 IST

సామజిక దూరం పాటించిన నాడే కరోనా మహమ్మారిని పారద్రోలవచ్చునని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు.

సామాజిక దూరం పాటిద్దాం

ఎచ్చెర్ల ఎమ్మెల్యే  కిరణ్‌ 


రణస్థలం, మార్చి 27:  సామజిక దూరం పాటించిన నాడే కరోనా మహమ్మారిని పారద్రోలవచ్చునని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆయన శుక్రవారం పర్యటించారు. స్వీయ నిర్బంధం పక్కాగా అమలు అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గ్రామాల్లో రహదారులను నిర్బంధించడం వల్ల అత్యవసర సేవలు అవసరమైనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోందన్నారు. రహదారుల్లో కంచెలు వేయరాదని ఆయన కోరారు. గ్రామాల్లో వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, వైద్యులు, అంగన్‌వాడీలు చేస్తున్న సేవలు సంతృప్తిగా ఉన్నాయన్నారు.  

Updated Date - 2020-03-28T06:55:35+05:30 IST