ఉత్తరాఖండ్లో మంచు తుపాను.. చిక్కుకుపోయిన 28 మంది పర్వతారోహకులు
ABN , First Publish Date - 2022-10-04T20:41:41+05:30 IST
ఉత్తరాఖండ్లో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. మంచులో 28 మంది పర్వతరోహకులు చిక్కుకుపోయారు
ఢిల్లీ : ఉత్తరాఖండ్లో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. మంచులో 28 మంది పర్వతరోహకులు చిక్కుకుపోయారు. పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని ఉత్తరాఖండ్ సీఎంకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు.