పాము కాటుకు గురైన మహిళ మృతి
ABN , First Publish Date - 2020-12-06T05:26:24+05:30 IST
మండలంలోని పెదపవని గ్రామంలో పాము కాటుకు గురైన ముప్పాళ్ల జ్యోతి(38) శనివారం మృతి చెందింది.
పెదపవని(లింగసముద్రం)డిసెంబరు 5 : మండలంలోని పెదపవని గ్రామంలో పాము కాటుకు గురైన ముప్పాళ్ల జ్యోతి(38) శనివారం మృతి చెందింది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం పొలంలో కలుపు తీస్తున్న జోత్యిని పాము కాటు వేసింది.దీంతో బంధువులు జ్యోతిని వెంటనే కావలిలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం చేర్పించారు.అయితే శనివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. జ్యోతి మృతితో భర్త, పిల్లలు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.