కారులో పాము కలకలం
ABN , First Publish Date - 2021-06-18T04:37:33+05:30 IST
ప్రయాణిస్తున్న కారులో నాగుపాము ప్రత్యక్షమై కలకలం
శంషాబాద్ : ప్రయాణిస్తున్న కారులో నాగుపాము ప్రత్యక్షమై కలకలం రేపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండిపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. షాద్నగర్కు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్కు బయలుదేరింది. మార్గమధ్యలోని తొండిపల్లి వద్దకు రాగానే కారు ముందుబాగంలో పాము ప్రత్యక్షమైంది. దీంతో డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు కారులోంచి కిందకు దిగి పరుగులు తీశారు. పామును గమనించిన స్థానికులు చంపడానికి చూడగా ఇంజన్ భాగంలోకి దూరింది. దీంతో స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇంజన్లోని పామును పట్టుకుని సమీపంలోని అడవిలోకి వదిలిపెట్టారు.