‘ఎస్ఎంఎస్’లు ఇకపై పూర్తిగా ఉచితం!
ABN , First Publish Date - 2020-02-20T09:32:44+05:30 IST
ఎస్ఎంఎస్ టారిఫ్ విషయంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న చార్జీలను పూర్తిగా తొలగించే దిశగా యోచిస్తోంది
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఎస్ఎంఎస్ టారిఫ్ విషయంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న చార్జీలను పూర్తిగా తొలగించే దిశగా యోచిస్తోంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎ్సల తర్వాత చేసే ప్రతి మెసేజ్కు సెల్యులార్ కంపెనీలు ప్రస్తుతం 50 పైసలు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని, కాబట్టి పూర్తిగా తొలగించాలని ట్రాయ్ భావిస్తున్నట్టు సమాచారం. స్మార్ట్ఫోన్లకు లేని వారికి మాత్రం ఇది ఊరటనిస్తుంది.