స్మార్ట్‌సిటీ స్టార్టప్‌ చాలెంజ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-05-07T13:02:26+05:30 IST

దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో మంచినీటి సమస్య

స్మార్ట్‌సిటీ స్టార్టప్‌ చాలెంజ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్/రాయదుర్గం : ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ స్మార్ట్‌సిటీ మిషన్‌ సంయుక్తంగా నగరాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం స్మార్ట్‌సిటీ స్టార్టప్‌ చాలెంజ్‌ను ప్రారంభించినట్లు ట్రిపుల్‌ ఐటీలోని హెడ్‌ రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ రమేష్ లోగనాథన్‌ తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో మంచినీటి సమస్య, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి సమస్యలను మార్గాలను సూచించే స్టార్టప్‌ల కోసం ట్రిపుల్‌ఐటీలోని స్మార్ట్‌సిటీ లివింగ్‌ల్యాబ్‌ ఆధ్వర్యంలో చాలెంజ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ సమస్య పరిష్కారాలను చూపించే స్టార్ట్‌పలను ఎంపికచేసి విజేతలకు రూ.10లక్షల ఈపీటీ రహిత ర్యాంప్స్‌ను అందించనున్నట్లు తెలిపారు.  జూన్‌ 1లోపు స్మార్ట్‌సిటీ స్టార్టప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-07T13:02:26+05:30 IST