చిలకమ్మకు ‘అరటి గెలల’ శోభ
ABN , First Publish Date - 2020-10-28T08:25:49+05:30 IST
దీర్గాశిలో చిలకమ్మ తల్లి పేరంటాల ఉత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పోలాకి, అక్టోబరు 27: దీర్గాశిలో చిలకమ్మ తల్లి పేరంటాల ఉత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో మెండ, పల్లి వారి కుటుంబాలు సంయుక్తంగా పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ ప్రాంగణంలో 1200 అరటి గెలలు కట్టి గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త పల్లి మూగెన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. చిలకమ్మ తల్లి పేరంటాల ఉత్సవం నేపథ్యంలో అరటి గెలలకు గిరాకీ ఏర్పడింది.