Prayagraj: మహంత్ నరేంద్రగిరి వారసుడిగా బల్బీర్ గిరి

ABN , First Publish Date - 2021-10-05T12:47:20+05:30 IST

మహంత్ నరేంద్రగిరి వారసుడిగా అతని శిష్యుడు బల్బీర్ గిరి మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు....

Prayagraj: మహంత్ నరేంద్రగిరి వారసుడిగా బల్బీర్ గిరి

ప్రయాగరాజ్(ఉత్తరప్రదేశ్): మహంత్ నరేంద్రగిరి వారసుడిగా అతని శిష్యుడు బల్బీర్ గిరి మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రయాగరాజ్ నగరంలోని బాఘంబరి గడ్డి మఠం అధిపతిగా ఉన్న మహంత్ నరేంద్రగిరి సెప్టెంబరు 22 వతేదీన ఆత్మహత్య చేసుకున్నారు. నరేంద్రగిరి మరణం తర్వాత అఖారా సాధువులు బాఘంబరి మఠం అధిపతిగా అతని శిష్యుడైన బల్బీర్ గిరి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నరేంద్రగిరి మరణం తర్వాత 16 రోజులకు బల్బీర్ గిరి బాధ్యతలు స్వీకరించనున్నారు. 


ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వేలాదిమంది సాధువులు పాల్గొననున్నారు.అఖిల భారతీయ అఖడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి తన సూసైడ్ నోట్ లో తన వారసుడిగా బల్బీర్ గిరిని పేర్కొన్నారు.నరేంద్రగిరి తన సూసైడ్ నోట్‌లో తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి, మరో ఇద్దరు వ్యక్తులు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నాడు.


Updated Date - 2021-10-05T12:47:20+05:30 IST